ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కి కూడా పాజిటివ్ రావడంతో ట్రీట్ మెంట్ కోసం అబ్రాడ్ వెళ్ళింది. ఇదిలా ఉంటె పలువురు సెలబ్రిటీస్ ఈ స్విన్ ఫ్లూకి భయపడి, ముందుగానే వాక్సిన్ వేయించుకుంటున్నారు.
అందులో ముందుగా సౌత్ ఇండియన్ బ్యూటీ త్రిష స్వైన్ ఫ్లూకి వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీరు కూడా వేయించుకోండని తెలిపింది. 'లేసా లేసా' చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన నటి త్రిష.
తమిళంలో కమల్హాసన్, విజయ్, అజిత్, విక్రం, సూర్యతోపాటు పలువురు అగ్రహీరోలతో ఆడిపాడిందీ అమ్మడు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి పెద్ద హీరోలతోనే కాదు.. కుర్ర హీరోల సరసన కూడా చిందులేసింది. తాజాగా బాలకృష్ణతో ఓ చిత్రంలో నటిస్తోంది.
...........................................................................................................................................................................