టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ రోల్స్ చేసుకుంటూ, కుదిరినప్పుడు హీరోయిన్ రోల్స్ చేసుకుంటూ, తనకంటూ సపరేటు స్టార్ డంని సొంతం చేసుకున్న బ్యూటీ అర్చన. ప్రస్తుతం అర్చన న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. ఎందుకంటే తను లీడ్ రోల్ లో చేసిన మూవీ, ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా, అది ఇంతకాలానికి రిలీజ్ కి నోచుకుంది. అయితే ఆ మూవీపైనే ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న ఈ బ్యూటీ కొన్ని నిజాలను చెప్పుకొచ్చిందట. వివరాల్లోకి వెళితే, అర్చన ఏకపాత్రాభినయంతో 'పంచమి'.

ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకురాలు సుజాత బౌరియా మాట్లాడుతూ ''ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు మెంబర్స చూసి అభినందించి క్లీన్‌ 'యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక వినూత్న ప్రయత్నం. ఈ స ఇనిమా కోసం నాకు సహకరించిన ప్రొడ్యూసర్‌గారికి నా ధన్యవాదాలు.

అర్చన అభినయం ప్రత్యేకంగా నిలుస్తుంది అని అన్నారు. అలాగే ప్రొడ్యూసర్‌ డి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ ''టెక్నికల్‌ రీజన్స్‌ వల్ల ఈ సినిమా విడుదలకు కొంచెం లేట్‌ అయినా ప్రేక్షకులు వంద శాతం ఈ సినిమా చూసి తృప్తి చెందుతారు. మార్చి 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇది ఓ ఎక్స్ పరిమెంటల్‌ కమర్షియల్‌ సినిమా, గ్రాఫిక్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ మూవీ గత రెండు సంవత్సరాల క్రితమే రిలీజ్ కావల్సి ఉంది. ఫైనాన్సియల్, థియోటర్స్ షార్టేజ్ కారణాలతో ఈ మూవీకి రిలీజ్ కి నోచుకోలేదు. ప్రతి సారి నిర్మాతలు, అర్చనకి మూవీ రిలీజ్ ఉందని చెప్పడం, తరువాత క్యాన్సిల్ అని చెప్పడం జరగుతుందట. ఇలా తనకి 30 సార్లు చిత్రయూనిట్ రిలీజ్ డేట్స్ చెప్పి మోసం చేశారు. ఇక ఇప్పుడైన పంచమి చిత్రం రిలీజ్ అయితే సంతోషిస్తాను అంటూ సన్నిహితుల చెప్పుకొని బాధపడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: