మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మాంచి మాస్ కథా చిత్రంతో ఓ సినిమా తెరక్కిస్తున్నారు. ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా బాగుందట. శ్రీను వైట్ల అంటే కామెడీ మార్క్ తప్పకుండా ఉంటుంది. రాంచరణ్ తో శ్రీను వైట్ల చేస్తున్న సినిమాలో రాంచరణ్ అక్క పాత్ర చాలా కీలకమట.

ఈ అక్క పాత్రకు కృతి కర్భందా అయితే బాగుంటుందని శ్రీను వైట్ల భావించాడట. కృతి దగ్గర ఈ కథ, పాత్ర గురించి చెప్పడం, ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని సమాచారం. ‘బోణి’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కృతి కర్భందా గుర్తుందా? ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది కృతి కర్భందా.

కాగా, ‘ఒంగోలు గిత్త’, ‘ఓం త్రీడీ’ తర్వాత తెలుగులో ఈ అమ్మడు కనపడనేలేదు. శ్రీను వైట్ల ఈ చిత్ర కథ వినిపించిన తర్వాత వెంటనే ఓప్పుకుందట. కృతి ముఖ్య పాత్ర చేయడం ఇది తొలిసారి కాదు. ‘అలా మొదలైంది’లో ముఖ్య పాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి అక్క పాత్ర అంటే ఇక అమ్మడు హీరోయిన్ పాత్రల మీద ఆశలు వదులుకోవాల్సిందే.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: