టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యకమైన క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రిష్. గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి చిత్రాలతో తెలుగులో సరికొత్త కథాంశాలకు కారకుడిగా దర్శకుడు క్రిష్, మంచి పేరుని సంపాదించుకున్నాడు. క్రిష్ తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా, క్రిష్ హిందీలో దర్శకత్వం వహించిన సినిమా.. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ అయింది బిటౌన్ షేక్ చేస్తుంది. అయితే ఈ థియోట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో ఎక్కడా డైరెక్టర్ పేరుని ఉపయోగించటం లేదు. అంతే కాకుండా కనీసం యూ ట్యూబ్ కి చెందిన ట్రైలర్ ప్రమోషన్స్ లోనూ డైరెక్టర్ ని పక్కన పెట్టినట్టు బిటౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

కేవలం అక్షయ్ కుమార్ మూవీగానే దీనిని చిత్ర నిర్మాతలు ప్రమోట్ చేయటం అనేది, బిటౌన్ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే, గతంలో తమిళంలో నిర్మించబడి సూపర్ హిట్‌గా నిలిచిన మురుగదాస్ సినిమా ‘రమణ’కి రీమేకే ఈ గబ్బర్. ఇక ‘రమణ’ సినిమా, తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఠాగూర్ హిందీ రీమేక్‌కు చాలా పేర్లు తెరపైకి వచ్చినా, చివరకు దర్శకుడు క్రిష్‌ను అవకాశం వరించింది. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. గబ్బర్ మూవీ ప్రమోషన్స్ లో డైరెక్టర్ పేరుని దాచివేయటం, అలాగే డైరెక్టర్ కి సరైన బ్రాండ్ క్యాంపెయిన్ ఇవ్వకపోవటం వెనుక ఉన్న అసలు విషయంపై బిటౌన్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. అయితే గబ్బర్ మూవీ వేసవి కానుకగా మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: