దర్శకుడు రాజమౌళికి కేవలం దక్షిణాది లోనే కాకుండా బాలీవుడ్  సినిమా రంగంలో కూడా  పేరు ప్రఖ్యాతలు  ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వం  వహించిన ‘ఈగ’ బాలీవుడ్ లో కూడ అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే నేపధ్యాన్ని కొనసాగిస్తూ రాజమౌళి తన ‘బాహుబలి’ ని హిందీలో కూడా డబ్ చేస్తూ మే 15న  ఒకేసారి ఇండియా అంతా విడుదల చేయడానికి ఏర్పాట్లు  చేస్తున్నాడు. 


బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్


 అటువంటి భారీ సినిమా పై ఒక బాలీవుడ్  దర్శకుడు సెటైర్లు వేయడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్  గా మారింది. బాలీవుడ్ లో మంచి  క్రియేటివ్  దర్శకుడిగా పేరు గాంచిన అనురాగ్ కశ్యప్ రణబీర్ కపూర్  అనుష్క శర్మలను  జంటగా పెట్టి ‘బాంబే వెల్వెట్’  అన్న సినిమాను తీస్తున్నాడు. ప్రముఖ నవలా రచయిత జ్ఞాన ప్రకాష్ వ్రాసిన ‘ముంబాయ్ ఫేబుల్స్’ అనే క్రైమ్  కామెడీ నవల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


రాజమౌళి సినిమాల పై పోటీగా

అయితే ఈ సినిమాను రాబోతున్న మే 15న విడుదల చేస్తున్నట్లుగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రకటించడంతో  అదే రోజు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ కూడా విడుదలల కాబోతోంది  కదా అని  బాలీవుడ్ మీడియా వర్గాలు ఈ సినిమా దర్శకుడి దృష్టికి తీసుకు వచ్చినప్పుడు అనురాగ్ కశ్యప్ చేసిన  సంచలన  వ్యాఖ్యలు  ఇప్పుడు బాలీవుడ్  మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 


తనకు రాజమౌళి పట్ల విశేషమైన గౌరవం ఉందని


తనకు రాజమౌళి పట్ల విశేషమైన గౌరవం ఉందని అదేవిధంగా ఆయన  సినిమాలను మొదటిరోజే చూస్తూ ఉంటానని అంత  మాత్రం చేత  రాజమౌళి సినిమాల పై పోటీగా  మరో  సినిమా విడుదల కాకూడదు అంటూ ఎక్కడైనా నిబందనలు ఉన్నాయా ? అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు రాజమౌళికి తన  ‘బాహుబలి’ పై ఎంత నమ్మకం ఉందో తనకు కూడా  తన  ‘బాంబే వెల్వెట్’  పై తనకు అంతే నమ్మకం ఉంది అని ఈ బాలీవుడ్  దర్శకుడు చేసిన కామెంట్స్ బాలీవుడ్ మీడియాకు  హాట్ టాపిక్ గా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: