టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రసవత్తరమైన పోటీ జరుగుతుంది. అదే మా అధ్యక్షుడి పదవి ఎన్నికలు. ఇందుకు రాజేంద్రప్రసాద్, అలాగే జయసుధ ఇద్దరూ తెగ పోటీ పడుతున్నారు. కళాకారుల జీవితాల్లో మంచి మార్పు కోసమే ‘మా’ అధ్యక్షుడిగా పోటీచేస్తున్నానని నటుడు రాజేంద్రప్రసాద్ వివరించుకోగా, ఇందుకు జయసుధ సైతం తనని గెలిపించాల్సిందగా అందరిని కోరుతుంది.
ఇదిలా ఉంటే రాజేంద్రప్రసాద్ కి మద్దతుగా నాగబాబు చేసిన వాఖ్యల వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాలు టాక్స్ వినిపిస్తున్నాయి. ‘మా’కు రూ. 3 కోట్లకు పైగా మూల నిధి ఉందని, ఆ డబ్బును ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘మా’ సభ్యత్వ రుసుమును రూ. లక్ష చేయడం దారుణమని నాగబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఓ అడుగు ముందుకేసి, చిన్న ఆర్టిస్ట్ లని, అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి గతంలో సపోర్ట్ ఇచ్చిన ఆర్టిస్ట్ లని నాగాబాబు ఒకేతాటిపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ఈ వ్యవహారంలో అల్లుఅరవింద్ కూడ తన వంతుగా రాజేంద్రప్రసాద్ కి సపోర్ట్ ఇస్తున్నాడు.
మొత్తంగా
నాగాబాబు, జయసుధ
పై తన ఆధిపత్యం నెగ్గించుకునేందుకు
విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
కచ్ఛితంగా
మా అధ్యక్ష పదవిని రాజేంద్రప్రసాద్
అందుకోవటం ఖాయం అనే టాక్స్
వినిపిస్తున్నాయి.
చిరంజీవి
సైతం రాజేంద్రప్రసాద్ కి
ఫోన్ చేసి, విజయం
తనదే అన్నట్టుగా భరోసా
ఇచ్చినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.