‘లెజండ్’ హీరోయిన్ రాధిక ఆప్టే ముంబాయ్ కు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ పరిశ్రమ పై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని లేపుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణతో ‘లయన్’ సినిమాలో నటించిన రాధిక ఆప్టే బాలీవుడ్ విమర్శకుడు రాజీవ్ మసంద్  నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.  

తాను దక్షిణాదికి సంబంధించి ఏ సినిమా రంగంలో అయినా నటిస్తాను కాని భవిష్యత్ లో తాను తెలుగు సినిమాలలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా రంగం అంతా పురుషాధిక్య డామినేషన్ తో కొనసాగుతోందని అంటూ టాలీవుడ్ లో హీరోయిన్స్ కు ఎటువంటి గౌరవం లేదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు  ఇక్కడి దర్శకులను, హీరోలను మెప్పిస్తూ నటించడం చాల కష్టం అని కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. 

అయితే ఈ వ్యాఖ్యలు వెనుక ఆమెకు టాలీవుడ్ లో జరిగిన అవమానం ఏమిటి అన్న విషయం  పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు  రాధిక ఆప్టే లేటెస్ట్ గా బాలకృష్ణతో నటిస్తున్న ‘లయన్’ సినిమా విషయంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక కూడా ఆమెకు ఇవ్వవలసిన పారితోషికం  ఆ సినిమా నిర్మాత రుద్రపాటి  రమణారావు ఆమెకు సరిగ్గా ఇవ్వకపోవడంతో ఆమె కోపంతో ఇటువంటి షాకింగ్ కామెంట్స్ చేసింది అని ఫిలింనగర్ లో గాసిప్పులు వినిపిస్తున్నాయి.  ఏది ఎలా ఉన్నా  రాధిక ఆప్టే టాలీవుడ్ సినిమా రంగం పై  చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది  డేగా మారాయి ..  


మరింత సమాచారం తెలుసుకోండి: