కత్రినా కైఫ్.. కైపెక్కించే కళ్లతో.. వన్నె తరగని అందాలతో కుర్రకారు మతులు పొగొడుతున్న కత్రినా ఇప్పటికే అనేక సార్లు.. వెబ్ ప్రపంచంలో ప్రపంచ నెంబర్ వన్ ఫిగర్ గా అవార్డులు అందుకుంది. కత్తి లాంటి కత్రీనా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ అమ్మడు ఇప్పుడు మరో ఘనత తన సొంతం చేసుకుంది. 

లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మైనపు బొమ్మగా కొలువు దీరింది. ఈ ప్రతిష్టాత్మక మైనపు బొమ్మల మ్యూజియంలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ నటుల్లో కత్రినా ఏడవ నటి. ఇంతకు ముందు బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్, హృతిక్ రోషన్‌లు టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు సంపాదించారు. 

పంజాబ్ రేడియో, టుస్సాడ్స్ వెబ్‌సైట్ కలిసి గత ఏడాది జరిపిన అన్‌లైన్ పోటీలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనేలను వెనక్కి నెట్టి కత్రినా విజయం సాధించింది. 20 మంది శిల్పులు, కళాకారులు నాలుగు నెలల పాటు శ్రమించి కత్రినా మైనపు బొమ్మను తీర్చి దిద్దారు. దీని తయారీకి కోటీ యాబై లక్షలు ఖర్చయినట్లు అంచనా. 

ఈ మైనపు బొమ్మను కత్రీనా కూడా సందర్శించింది. తన నిలువెత్తు బొమ్మను చూసి ఆశ్చర్యపోయింది. ఆనందంగా ఆ బొమ్మ దగ్గర పోటోలకు ఫోజులిచ్చింది. మ్యూజియంలోని నాట్య భంగిమలో ఉన్న తన బొమ్మను చూసి అచ్చం తన లాగే ఉందని మురిసి పోయిందట కత్రినా.


మరింత సమాచారం తెలుసుకోండి: