ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి ఆఫర్స్ లేకుండా ఖాళీగా ఉన్న బ్లాక్ బ్యూటీ హీరోయిన్ ఎవరంటే, కచ్ఛితంగా ప్రియమణి అని చెప్పవచ్చు. ఎందుకంటే తను హీరోయిన్ గా చేసిన సినిమాలు రిలీజ్ అయి చాలా సంవత్సరాలు అయిది.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అనవసరంగా లీడ్ రోల్స్ అంటూ, విపరీతమైన ఎక్స్ పోజింగ్ ని చూపించడంతో, ఈ బ్యూటీపై బోల్డ్ స్టాంప్ వేశారు టాలీవుడ్ మేకర్స్. దీంతో టాలీవుడ్ నుండి తనకి కేవలం ఐటెం సాంగ్ ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయి. బిటౌన్ లో ఆఫర్స్ కోసం ప్రయత్నించిన ప్రియమణి, కేవలం షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో మాత్రమే ఐటెం సాంగ్ ఆఫర్ ని చేజిక్కించుకొని సరిపెట్టుకుంది.

ఆ తరవాత ఇప్పటి వరకూ ఎటువంటి ఆఫర్స్ లేకుండా ఖాళీగా ఉండిపోయింది. ఇలా చాలా సంవత్సరాల తరువాత ప్రియమణి ఓ హీరోయిన్ ఆఫర్ ని చేజిక్కించుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రియమణి తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించే అవకాశం చేజిక్కుంచుకుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు రామ్ హీరోగా నటిస్తున్నారు.

వీరితో పాటు మరో తమిళ దర్శకుడు, రచయిత మిస్కిన్ దీనికి కథను సమకూర్చడమే కాకుండా, ఇందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. అంతేకాక మిస్కిన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన జీఆర్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. చాలా కాలం తర్వాత ప్రియమణికి తమిళంలో ఆఫర్ రావడంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: