గత కొద్ది రోజులుగా హీరో శివాజీ వార్తలతో మీడియా హోరెత్తి పోతోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రజలలోకి చోచ్చుకుపోతున్నాడు శివాజీ. అతడి సమావేశాలకు ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రజల నుండి స్పందన వస్తోంది.

అయితే భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఉన్న శివాజీ అదే పార్టీని టార్గెట్ చేస్తూ ప్రజలు వద్ద కామెంట్లు చేస్తూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారతీయ జనతాపార్టీ నాయకులు శివాజీ పై తీవ్ర కోపంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ  పార్టీకి చెందిన కొందరు రాష్ట్ర నాయకులు శివాజీకి భారతీయ జనతాపార్టీ  తో సంబంధం లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

దీనితో శివాజీ ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నాడు అన్న విషయం పై కామెంట్లు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కొందరు పవన్ వీరాభిమానులు శివాజీ  జనసేనలో చేరి తన  రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నారని టాక్. 

ఇదే విషయంలో మరొక  అడుగు ముందుకు వేసి కొందరు శివాజీ వద్దకు వెళ్ళి పవన్ ‘జనసేన’ లో చేరి తన పోరాటాన్ని కొనసాగించ వలసిందిగా శివాజీకి సూచనలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. దీనితో రాబోతున్న  రోజులలో శివాజీ పవన్ పార్టీ ‘జనసేన’ బాట పడతాడా అనే విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. అయితే మౌనమే తన  భాషగా కొనసాగుతున్న పవన్ శివాజీ వైపు చూస్తాడా అన్నదే  సందేహం..



మరింత సమాచారం తెలుసుకోండి: