నిన్న మా సంస్థ ఎన్నికలలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ రాజేంద్రప్రసాద్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆ ప్యానల్ వర్గం వారు మితిమీరిన ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటూ అనాలోచితంగా చేసిన కామెంట్స్ టాప్ కమెడియన్ బ్రహ్మానందంకు అనుకోని తలనొప్పిని తెచ్చిపెట్టాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే రాజేంద్రప్రసాద్ విజయం తరువాత జరిగిన మీడియా సమావేశంలో అతడి ప్యానల్ కి సంబంధించిన నటుడు నర్సింగ్ యాదవ్ షాకింగ్ న్యూస్ ను బయట  పెట్టాడు.

‘మా’ ఎన్నికలలో  ఓటు వేయడానికి వచ్చిన బ్రహ్మానందం తన ఓటు వేసి బయటకు వస్తూ ‘ఒరే నీకే ఓటు  వేసాను నువ్వు తప్పకుండా గెలుస్తావు’ అని చెప్పినప్పుడే బ్రహ్మీ లాంటి వాళ్ళు అనేకమంది తమకు ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసారని ఆనాడే తెలిసి పోయిందని  షాకింగ్ కామెంట్స్ చేసాడు నర్సింగ్ యాదవ్. ఈ మాటలకు అదే ప్యానల్ కు చెందిన కాదంబరి కిరణ్ కూడా వంత పాడుతూ చాలామంది సెలెబ్రెటీలు తనకు మా ఎన్నికలలో ఓటు వేసిన తరువాత తాము రాజేంద్రప్రసాద్ కే ఓటు వేశామని ఓటింగ్ రోజునే చెప్పారని ఆనందంతో అసలు విషయాన్ని లీక్ చేయడంతో అక్కడ ఉన్న రాజేంద్రప్రసాద్ ఖంగ్ తిని నర్సింగ్ యాదవ్ కాదంబరి కిరణ్ ల ఉత్సాహం పై నీళ్ళు జల్లాడు.

అయితే మా ఎన్నికల రాజకీయాలలో ఎటువంటి పాత్రను పోషించని బ్రహ్మానందo ప్రస్తావన ఆ మీడియా సమావేశంలో రావడం మీడియావారినే ఆశ్చర్య పరిచింది. ఈ వార్తలు ఇలా ఉండగా మా సంస్థ ఎన్నికల ఫలితాలను జగన్  పార్టీ హైజాక్ చేస్తోందా?  అంటూ విశ్లేషణలను  కొన్ని పత్రికలు వ్రాస్తున్నాయి. 

దీనికి కారణం  వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కీలక సభ్యుడిగా ఉన్న నటుడు విజయ్ చందర్, నటి రోజా నిన్న అనేక ఛానల్స్ లో ప్రసారమైన  కార్యక్రమాలలో చేసిన కామెంట్స్ ‘మా’ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్ విజయాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఎలా చూసుకున్న మా ఎన్నికల హడావిడికి సంబంధించిన వార్తలను ఇరు రాష్ట్రాలలోని  ప్రజలు అత్యంత ఆసక్తిగా ఫాలో కావడం అందరికీ ఆశ్చర్యంగా మారింది..

   








మరింత సమాచారం తెలుసుకోండి: