ఎమ్మెల్యే రోజా ఏ విషయాల్లోనైనా ఘాటుగా స్పందించి తన నిర్ణయం చెబుతుంది. ఆమె మాటలు అవతలి వాళ్లకు దిమ్మతిరిగి పోయాలా ఉంటాయి. తాజాగా ‘ మా’ ఫలితాలపై స్పందించారు. తెలుగు చలనచిత్ర ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా  నవ్వుల రేడు రాజేంద్రప్రసాద్ ఎన్నిఅవడం పై సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలకు గుణపాఠమని రోజా ఎద్దేవ చేసింది. పేదకళాకారుడు తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. 


మా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్,మురళీ మోహన్ తదితరులు


గతంలో కొందరు గౌరవం కోసం మా అధ్యక్ష పదవిని వాడుకున్నారని విమర్శించారు. వారు కళాకారులకు ఏమీ చేయలేదన్నారు మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడం సంతోషమన్నారు. ఆయన కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, రోజా వ్యాఖ్యలు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ నటుడు మురళీ మోహన్‌ను ఉద్దేశించే కావొచ్చునని అంటున్నారు. మా ఎన్నికల ఓటింగ్ సమయంలోను ఆమె ఘాటుగానే స్పందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: