రామ్ చరణ్ తన సినిమాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తండ్రి చిరంజీవి  సలహాలు తీసుకోకుండా ఒక్క అడుగు కూడ ముందుకు వేయడు. అటువంటి చరణ్ తనకు వచ్చిన  ఒక అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకుని  పెద్ద తప్పు  చేసాడు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం'  విడుదలైన మొదటి రోజు  మొదటి ఆట నుండి పాజిటివ్  టాక్ తెచ్చుకుని మంచి రొమాంటిక్ మూవీగా పేరు తెచ్చుకుంది. 

చాలా కాలం తర్వాత మణితర్నం ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. మమ్ముటి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ల జంట మన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడ బాగా నచ్చింది.  లివ్ ఇన్ రిలేషన్ షిప్, లవ్ అంశాలను బేస్ చేసుకుని ఎంతో బ్యూటిఫుల్ గా ఈ సినిమాను మణి రత్నం తీసాడు అంటూ మీడియా పొగడ్తలతో  కామెంట్స్ వ్రాస్తోంది. 

దీనికి తోడు ఈ  సినిమాకు కలెక్షన్స్  కూడా బాగానే వస్తున్నాయి. అయితే  వాస్తవానికి ఈ సినిమాను మణి రత్నం రామ్ చరణ్‌తో తీయడానికి  చాల ప్రయత్నాలు చేసాడు. గతంలో ఒక  సారి మణిరత్నం, సుహాసిని స్వయంగా వచ్చి చిరంజీవి, రామ్ చరణ్ లను కలిసారు అన్న వార్తలు కూడా వచ్చాయి. దీనితో అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. 

అయితే అప్పటికే ‘ఆరెంజ్' లవ్ స్టోరీతో దెబ్బతిని ఉన్న రామ్ చరణ్ మాస్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేయడానికి సాహసం చేయలేక పోవడంతో చిరంజీవి సలహాతో ఈసినిమాను తిరస్కరించాడు అని టాక్. అయితే రామ్ చరణ్  ఈసినిమాకు అంగీకరించి  ఉంటే  చరణ్ కెరియర్ లో ఒక కొత్త  ఇమేజ్ ని క్రియేట్ చేసిన సినిమాగా ‘ఓకే బంగారం’ మిగిలేదని కొందరి వాదన. ఏది ఎలా  ఉన్నా చాల కాలం తరువాత మణి  రత్నం మళ్ళీ సక్సస్ బాట పట్టాడు..







మరింత సమాచారం తెలుసుకోండి: