మెగా అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటూ వారి సలహాలను అభిప్రాయాలను స్వీకరిస్తూ తన  మెగా కుటుంబ హీరోల ఇమేజ్ ని అనుక్షణం కాపాడుకునే ప్రయత్నంలో చిరంజీవి వ్యవహరించినంత వ్యూహాత్మకంగా మరే టాప్ హీరో వ్యవహరించడు అన్నది వాస్తవం.

అందువల్లనే మెగా కుటుంబం ఈరోజు ఒక మహా వృక్షంలా ఎదిగిపోయి టాలీవుడ్ ను శాసిస్తోంది. గుండెపోటుతో ఇటీవలే మృతిచెందిన చిరంజీవి వీరాభిమాని దాడి లక్ష్మీ నారాయణ కుటుంబసభ్యులను అనకాపల్లిలో అల్లుఅర్జున్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడమే కాకుండా ఆయన ఫోటోకు పూల దండ వేసి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి చిరంజీవి తరఫున తాను వచ్చాను అంటూ తెలియచేయడమే కాకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మెగా కుటుంబం తరఫున బన్నీ మాట ఇచ్చాడు.

చిరంజీవికి వీరాభిమాని అయిన లక్ష్మీ నారాయణ చనిపోయేంతవరకు ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగాగా కొనసాగడమే కాకుండా చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ కార్యక్రమాలలో చాల చురుకుగా పాల్గొన్నాడు లక్ష్మి నారాయణ. 

అల్లు అర్జున్ రాకతో అనకాపల్లిలో సందడి నెలకొంది. స్టైలిష్ స్టార్‌ని చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. దీనితో ఈ పరామర్శించే కార్యక్రమం ఒక సినిమా ఫంక్షన్ కార్యక్రమంలా మారిపోయి మెగా హీరోల హవాను మరోసారి చాటింది.



మరింత సమాచారం తెలుసుకోండి: