కోలీవుడ్ బ్యూటీ త్రిష తన ప్రియుడు మరియూ కాబోయే భర్త వరుణ్ ను అవమానించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దికాలంగా నిశ్చితార్ధం జరుపుకున్న త్రిష-వరుణ్ ల జంట విదిపోతోంది అన్న వార్తలకు బలం చేకూరుస్తు త్రిష తనకు కాబోయే భర్త వరుణ్ మన్యన్ పట్ల ప్రవర్తించిన తీరు టాపిక్ ఆఫ్ కోలీవుడ్ గా మారింది.
కొద్ది కాలం క్రితం అత్యంత ఘనంగా త్రిష, వరుణ్ ల నిశ్చితార్ధంలో వరుణ్ త్రిషకు బహుకరించిన ఖరీదైన ఎంగేజ్ మెంట్ రింగ్ ను వరుణ్ కు తిరిగి పంపించి వేసింది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం గత కొద్దిరోజులుగా త్రిష వేలుకు ఉండవలసిన ఈ రింగ్ కనిపించక పోవడంతో మీడియా ఈ ఊహాగానాలు చేస్తోంది.
దీనికితోడు ఈమధ్య కాలంలో వరుణ్ ఇంట్లో జరిగిన ఒక ముఖ్యమైన ఫంక్షన్ కు వరుణ్ ఎన్ని సార్లు పిలిచినా త్రిష ఆ ఫంక్షన్ కు వెళ్ళలేక పోవడంతో త్రిష పై వరుణ్ కుటుంబ సభ్యులకు కోపం వచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా పిల్లలు పుట్టినప్పుడు లేదా పెళ్ళి జరిగినప్పుడు అదృష్టం దశ తిరుగుతుంది అని అంటారు.
కానీ త్రిషకు నిశ్చితార్ధం అయిన తరువాత దశ తిరిగి ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడ ఈమె హవా మళ్ళీ తిరిగింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న త్రిష త్వరలోనే కమలహాసన్, పవన్ కళ్యాణ్ ల సినిమాలలో కూడా నటించబోతోంది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇక త్రిషకు వరుణ్ తో అవసరం లేదనే అనుకోవాలి..