మాటీవి లో కలర్స్ ప్రోగ్రాం చేస్తూ ముద్దు ముద్దు గా మాట్లాడుతు అప్పట్లోనే వావ్ అనిపించిన కలర్స్ స్వాతి తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు నటించిన సినిమాలు కొన్నే అయినా మంచి హిట్లు అందుకుంది. థాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, మంచి నటి అనిపించుకుంది స్వాతి. అంతే కాదు స్వాతి తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది.ప్రస్తుతం ‘త్రిపుర’ అనే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


కలర్స్ ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ తో చిట్ చాట్ చేస్తున్న స్వాతి


‘గీతాంజలి’ ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సంబంధించి టాకీలో కీలకమైన సన్నివేశాలను ఎంతో ఖర్చుతో ఫిలింసిటీలో మరియు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోని పలు లోకేషన్లలో చిత్రీకరంచినట్లు దర్శకుడు రాజ్ కుమార్ తెలిపారు.  ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేసి రష్ చేసాము. చాలా అధ్బుతంగా వచ్చింది. టెక్నీషియన్స్ ఎంతగానో సహకరించారు” అని చెప్పారు. చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్, కథ-దర్సకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు

మరింత సమాచారం తెలుసుకోండి: