కథానాయిక స్వాతి పెళ్లి కూతురైంది.. సంప్రదాయ పద్దతిలోఈ సుందరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి జరిగింది రియల్ లైఫ్‌లో అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇది రీల్‌లైఫ్ పెళ్లి మాత్రమే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటనకు ఆస్కారమున్న పాత్రలతో వరుస విజయాల్ని దక్కించుకుంటున్న స్వాతి నటిస్తున్న తాజా చిత్రం త్రిపుర.

క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకిరణ్ దర్శకుడు. తొలిషెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. ఈసందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ హారర్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. త్రిపుర ఎవరు? తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న ఆమె జీవితంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలేమిటి? వాటివల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అద్భుతమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాం అని తెలిపారు. 40 శాతం టాకీ పూర్తయిందని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందని నిర్మాతలు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: