‘గబ్బర్ సింగ్-2' సినిమా ఇంకా మొదలు కాకుండానే ఆ సినిమా విడుదల గురించి బయటకు  వస్తున్నషాకింగ్ న్యూస్ మహేష్ బాబును ఇరకాటంలో పెడుతోంది అని వార్తలు వస్తున్నాయి. ‘పవర్' మూవీ ఫేమ్ కెఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మే నెలాఖరున కాని జూన్ లో  కాని  ప్రారంభించి  2016 సంక్రాంతి నాటికి విడుదల చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాను అత్యంత వేగవంతంగా పూర్తి చేద్దాం అని దర్శకుడు రవీంద్ర భావించినా  ఈ సినిమాలో పవన్ తన మ్యానరిజమ్ దగ్గరనుంచి, డైలాగులు దాకా అన్నీ వెరైటీగా కనిపించాలి అని సూచనా ఇచ్చిన నేపధ్యంలో ప్రతీది ఆచితూచి అడుగు వేయడం వల్ల ఈసినిమా నిర్మాణం లేట్ అవ్వబోతున్న నేపధ్యంలో పవన్ 2016 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్లు టాక్. 

అయితే ఇప్పుడు ఈ లేటెస్ట్ న్యూస్ మహేష్ ప్లాన్ కు గండి కొడుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ నెల మే 31 న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న తన ‘బ్రహ్మోత్సవం’ సినిమాను వేగంగా పూర్తి చేసి తనకు కలిసి వచ్చే సంక్రాంతి సెంటిమెంట్ తో 2016 సంక్రాంతికి విడుదల చేయాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న సందర్భంలో ఈ న్యూస్ మహేష్ షాకింగ్ గా మారింది అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈ మాటలే నిజం అయితే మహేష్ తన సంక్రాంతి సెంటిమెంట్ ను వదులుకొని తన ‘బ్రహ్మోత్సవo’ సినిమాను వేరే  తేదీకి విడుదల చేయ వలసిన పరిస్థుతులు ఏర్పడతాయని టాక్. ఇది ఇలా ఉండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ తో తన  హ్యాట్రిక్ మూవీ ‘కోబ‌లి’  ని  2016 చివర్లో సెట్ట్స్ పైకి  తీసుకు వెళ్ళడానికి  త్రివక్రమ్ అండ్ టీమ్ రీసెర్చ్ మొద‌లెట్టింద‌ని అంటున్నారు.  రాయ‌ల‌సీమ జీవిన విధానం, వందేళ్ల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? మ‌ధ్యలో వ‌చ్చిన మార్పులేంటి? అనే విషయాల పై చాలలోతుగా అప్పుడే త్రివిక్రమ్ అధ్యయనం మొదలు పెట్టాడు అనే వార్తలు కూడ వినిపిస్తునాయి. ఏది ఎలా ఉన్నా ఎంపరర్ పవన్ నిర్ణయంతో మహేష్ ఏమైపోతాడో చూడాలి.. 






మరింత సమాచారం తెలుసుకోండి: