ఇప్పటికే మహేష్ కుటుంబ సభ్యులకు పద్మాలయ బ్యానర్, ఇందిరా ప్రొడక్షన్స్, కృష్ణా ప్రొడక్షన్స్ పేర్లమీద మూడు సినిమా నిర్మాణ సస్థలు ఉన్నా మళ్ళీ కొత్తగా తన కొడుకు గౌతమ్ పేరిట మరో కొత్త నిర్మాణ సంస్థను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని ఆలోచిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. మహేష్ బాబు సోదరి మంజుల ఇందిరా ప్రొడక్షన్స్, సోదరుడు రమేశ్ కృష్ణా ప్రొడక్షన్స్ పేర్ల పై అప్పుడప్పుడు సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ వ్యూహాత్మకంగా ఏడాదికో, రెండేళ్లలో సోదరి మంజులకు, సోదరుడు రమేష్ బాబుకు తన డేట్స్ కేటాయిస్తూ ఉంటాడట.
ఏదైనా ఒక సినిమాకు సంబంధించి నిర్మాతలు మహేష్ బాబు డేట్స్ కోసం ఒత్తిడి చేస్తున్నప్పుడు తన డేట్స్ అన్నీ ఇందిరా ప్రొడక్షన్స్, కృష్ణా ప్రొడక్షన్స్ దగ్గర బ్లాక్ అయిపోయాయని తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు చెప్పి ఆ నిర్మాతలను తన డేట్స్ ను తన సోదరి లేదా సోదరుడు వద్ద వారిని ఒప్పించి తీసుకుని వస్తే తాను వారి సినిమాలో నటిస్తాను అంటూ ట్విస్ట్ ఇస్తాడని టాక్. అయితే దీనికి బదులుగా ఆ నిర్మాతలు మహేష్ కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా కలిసి వచ్చేడట్లుగా చేసి వారికి లాభం కలిగిస్తూ ఉంటారని అనే మాటలు కూడా ఉన్నాయి.