టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోగా కొన్ని సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిన హీరో సిద్ధార్థ్ ఆ తరువాత టాలీవుడ్ లో తన హవా పూర్తిగా తగ్గి పోవడంతో తెలుగులో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనితో టాలీవుడ్ పై కోపం పెంచుకున్న సిద్ధార్థ్ కోలీవుడ్ సినిమాల వైపు వెళ్ళి పోయాడు. 

అక్కడ సినిమాలు చేస్తూ తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు సిద్ధార్థ్. సమంత సిద్ధార్థ్ ల ప్రేమ వ్యవహారం నుండి బ్రేకప్ వ్యవహారం వరకు తమ పై అనేక కథనాలు వ్రాసిన మీడియా పై సిద్ధార్థ్ కు వచ్చిన కోపాన్ని బయట పెట్టకుండా వేరే విధంగా ఈమధ్య ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియాను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు సిద్ధార్థ్. 

సినిమా బాగోగుల్ని నిర్ణయించి రేటింగ్‌ ఇవ్వడానికి వెబ్‌సైట్లకు వున్న అర్హత ఏమిటి అని అంటూ తమ వ్యక్తిగత జీవితాలపై బురద జల్లి పబ్బం గడుపుకునే సైట్లను తాను చూడను అంటూ కామెంట్స్ చేసాడు సిద్ధార్థ్. అంతేకాదు జర్నలిస్టు అనేవాడికి కొన్ని విలువలు వుంటాయని అటువంటి విలువలతో కూడిన కామెంట్స్ మాత్రమే తాను చదువుతానని కామెంట్స్ చేసాడు సిద్ధార్థ్. తన మీద కాని ఇతర ఆర్టిస్టుల మీద కాని మీడియా ఎదో ఒక వార్తలు వ్రాస్తూనే ఉంటుందని అది వారికి వ్యాపారంగా మారిపొయింది అంటూ ఘాటైన సెటైర్లు వేసాడు.

స్టార్‌డమ్‌ అనే పదం తనకు తెలియదనీ తన పని మాత్రం తాను చేసుకుంటూ పోతూ ‘బొమ్మరిల్లు’ లాంటి మరో మంచి తెలుగు సినిమాలో నటించాలని ప్రయత్నిస్తున్నాను అంటూ తన మనసులో కోరికను బయటపెట్టాడు. ల్యాప్‌ టాప్‌ పట్టుకున్నవాడల్లా జర్నలిస్ట్‌ కాడు అంటూ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి..







మరింత సమాచారం తెలుసుకోండి: