టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు  తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 9.30 గంటలకు శ్రీవారి సన్నిధిలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సిని నటుడు నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి  పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాఘవేంద్రరావు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ తనకు ఈ పదవి దక్కడంపై ఆనందం వ్యక్తం చేసారు.

శ్రీవారికి, శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు సేవ చేసే భాగ్యం లభించడం సంతోషంగా ఉందన్నారు. మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ ఆ వేంకటేశ్వర స్వామి టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తానంటే ఎందుకు కాదంటాను, తప్పకుండా స్వీకరిస్తా అన్నారు.శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి విశ్వాసాలు కలిగిన రాఘవేంద్రరావుకు టీటీడీ ధర్మకర్తల మండలిలో మరోసారి అవకాశం రావటం అదృష్టమన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: