ఇక భవిష్యత్ లో శృతిహాసన్ సినిమాలు టాలీవుడ్ లో వచ్చే అవకాశం లేకుండా ఏర్పడే అవకాశాలకు స్వయంగా శృతి హాసన్  తన వింత ప్రవర్తనతో పరిస్థుతులను ఏర్పరుచు కుంటోంది అంటూ వార్తలు వస్తున్నాయి. శ్రుతి ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు సినిమాలు కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నా టాలీవుడ్ మాత్రం ఆమె ప్రస్తుతం మహేష్ బాబు సినిమా తప్పా మరే సినిమా చేయక పోవడం వెనుక ఆసలు కారణం శ్రుతి వింత ప్రవర్తన అని అంటున్నారు.

దీనికి కారణం ప్రస్తుత టాప్ నిర్మాతలంతా శ్రుతి ప్రవర్తన పై కోపం పెంచుకోవడమే ప్రధాన కారణం అని అంటున్నారు. కోలీవుడ్ సినిమాలలో 50 లక్షలకు నటించే శ్రుతి టాలీవుడ్ సినిమాలకు వచ్చే సరికి కోటిన్నర పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని టాక్. అంతేకాదు తనకు టాలీవుడ్ లో ‘గబ్బర్ సింగ్’ ‘బలుపు’ ‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయని అందువల్లనే తాను ఆ రేంజ్ లో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాను అంటూ టాలీవుడ్ నిర్మాతలకు శ్రుతిహాసన్ చుక్కలు చూపెడుతోందని టాక్.

ఇదే శ్రుతి బాలీవుడ్ లో అవకాశాలు వస్తే చాలు బాలీవుడ్ నిర్మాతలు ఎటువంటి పారితోషికం ఇచ్చినా మారు మాట్లాడకుండా సంతకాలు పెడుతోందని అయితే టాలీవుడ్ లో మాత్రం ఇలా వింతగా ప్రవర్తిస్తోందని టాలీవుడ్ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

దీనితో శ్రుతి పారితోషికం కంటే తక్కువ పారితోషికానికి వచ్చే హీరోయిన్స్ గురించి టాలీవుడ్ నిర్మాతలు ఆలోచించే విధంగా శ్రుతి ప్రవర్తన వారిని మార్చడమే కాకుండా రకుల్ ప్రీత్ ఎదుగుదలకు ఒక విధంగా శ్రుతి వింత ప్రవర్తన కారణం అవుతోంది అంటూ ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తనని నటిగా గుర్తించి, స్టార్‌ని చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీని  పిండుకోవాలని చూస్తూ వేరే చోట్ల మాత్రం ఎంతిచ్చినా ఫర్వాలేదని అంటున్న శృతిహాసన్‌ని ఎంకరేజ్‌ చేయకూడదని టాలీవుడ్ నిర్మాతలు ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చినట్లు టాక్. ఇక మరి శ్రుతి ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: