ప్రస్తుతం సినిమాలకు సంబంధించి జాతీయ మీడియాకు ‘బాహుబలి’ వార్తలు హాట్ న్యూస్ గా మారడంతో ప్రముఖ పత్రికలు అన్నింటిలోను ‘బాహుబలి’ కి సంబంధించిన వార్తలతో ముఖ్యంగా రాజమౌళి ప్రతిభకు సంబంధించిన వార్తలు విశ్లేషణలతో మీడియా హోరెత్తి పోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన బిబిసి ఛానల్ కూడ ‘బాహుబలి’ సినిమా వార్తలను ప్రసారం చేస్తోంది అంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఎవరికైనా అర్ధం అవుతుంది.

అయితే రోజురోజుకు పెరిగిపోతున్న ‘బాహుబలి’ క్రేజ్ కు సంబంధించిన వార్తలు ఒక విధంగా ప్రభాస్ అభిమానులను భయపెడుతున్నాయి అనే విశ్లేషణ కూడ ఉంది. దీనికి కారణం ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్తలను విన్నా దర్శకుడు రాజమౌళి ప్రతిభ విశేషాల గురించి హైలెట్ చేస్తూ వార్తలు వస్తున్నాయి కాని ఎక్కడా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్ ప్రతిభ గురించి జాతీయ మీడియాలో కాదుకదా కనీసం మన తెలుగు మీడియాలో కూడా పెద్దగా వార్తలు రాకపోవడం ప్రభాస్ అభిమానులను కలవర పెడుతోంది అనే టాక్ ఉంది.

దీనికి తోడు రాజమౌళి కూడా ఈ సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలు అనుష్క, తమన్నా, రానా, నాజర్, రమ్యకృష్ణ లను కూడ ప్రభాస్ తో సమానంగా ఎలివేట్ చేస్తూ రాజమౌళి పబ్లిసిటీ ఇస్తూ ఉండటంతో ఊహించిన విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఆ కీర్తి అంతా ఎక్కువ భాగం రాజమౌళి ఖాతాలోకి వెళ్లిపోయి మిగిలిన భాగం ప్రభాస్ తో పాటు ప్రధాన పాత్రలు పోషిస్తున్న రానా, నాజర్, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నాలు సమానంగా పంచుకుంటే ఈ సినిమా కోసం రెండేళ్ళు ఎన్నో అవకాశాలు వదులుకున్న ప్రభాస్ పరిస్థితి ఏమిటి అని ప్రభాస్ వీరాభిమానులు భయపడుతున్నట్లు మాటలు వినపడుతున్నాయి.

ఒకప్పుడు దాసరి, విశ్వనాథ్, బాపు, బాలచందర్, భారేతీరాజ లాంటి దర్శకుల పేరును చూసి సినిమాలకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితిని తిరిగి రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో ఆ టాప్ డైరెక్టర్ల స్థాయిని చేరుకున్న నేపధ్యంలో ‘బాహుబలి’ తొలి 100 కోట్ల సినిమాగా టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసినా ఆ రికార్డులు ఎంత వరకు ప్రభాస్ ను టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి చేరుస్తాయి అన్న అనుమానాల మధ్య ప్రభాస్ వీరాభిములు ఉన్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: