తెలుగు, తమిళ ఇండస్ట్రీలో  ఒకప్పుడు కుర్రకారు మతులు పోగొట్టిన హీరోయిన్ కుష్బు. తమిళ నాడులో ఈమె ఫ్యాన్స్ విపరీతంగా ఉండేవారు ఎంతలా అంటే తమ హీరోయిన్ కి ఏకంగా గుడి కట్టించారు. కుష్బూ ఎప్పుడూ ఏదో ఒక వివాదాల్లో ఉంటూనే ఉంటుంది. కుష్బూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆంటీ, అక్కల పాత్రలు వేస్తూ, తెలుగు, తమిళ టీవీ షో లో యాంకరింగ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత కాలంలో రాజకీయ రంగంలో కి ప్రవేశించింది కుష్బూ.


రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ప్రచారం చేస్తున్న కుష్బు


తమిళనాట ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఈ భామ ఇటీవల రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించాలని  ఉద్దేశ్యంతో ఇకపై సినిమాలల్లో నటించాకుడదని నిర్ణయించుకుంది.  అసలే తమిళ నాట రాజకీయాలు మహా రసవత్తరంగా ఉంటాయి ఈ టైమ్ లో ఇటు సినిమాలవైపు, అటు రాజకీయాల వైపు దృష్టి కేంద్రీకరించాలంటే చాలా కష్టమవుతుందని సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంది . అందుకే ఇక నా సినీ ప్రస్థానం ముగిసినట్లేనని ప్రకటించేసింది కుష్బూ .


కుష్బూ ఫ్యామిలీ ఫోటో


ఆ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన కుష్బూ వచ్చే సంవత్సరం తమిళనాట ఎన్నికలు ఉన్నందున ఇకపై పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించి కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలని ఆశ పడుతోంది. మరి ఈ ఫైర్ బ్రాండ్ కన్న కలలు నెరవేరుతాయో లేదో అని అందరూ అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: