ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారిన మూవీ బాహుబలి. బాహుబలి మూవీకి సంబంధించిన ప్రతి చిన్న న్యూస్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మే 31న రిలీజ్ కానున్న ‘బాహుబలి’ ఆడియో అలాగే ట్రైలర్ పైనే ఉంది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ శ్రమతో నిర్విరామంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా ఆడియో లాంచ్ కోసం సర్వం సిద్దం చేస్తున్నారు. రాజమౌళి మునుపెన్నడూ లేని రీతిలో, ఈ ఆడియో లాంచ్ ని ప్లాన్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా కేవలం బాహుబలి మూవీ గురించి మాట్లాడుకునేలా తాను ఆలోచిస్తున్నాడు.

గత కొద్ది రోజులుగా ఈ ఆడియో లాంచ్ కోసం ఓ సరైన వేదిక కోసం అన్వేషిస్తున్నారు. ఫైనల్ గా ఈ చిత్ర టీం బాహుబలి ఆడియో లాంచ్ కోసం హైదరాబాద్ లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ ని ఫైనలైజ్ చేసారు. ఈ వేడుకకి సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ సూపర్ స్టార్స్ హాజరు కానున్నారు. ఈ హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ లో ట్రైలర్ ని ప్లే చెయ్యడం కోసం ఓ భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్ ని కూడా సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: