గత కొంత కాలంగా టాలీవుడ్ నే షేక్ చేస్తున్న ఎర్రచందం స్మగ్లింగ్ కేసు.. ఇందులో ప్రధాన నింధితుడిగా ఉన్న మస్తాన్ వలి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ నటి నీతూ అగర్వాల్ కూడా కేసులో ఇరుక్కుంది. ఆ మధ్య తనపై ఎవరో హత్యాచారానికి ప్రయత్నించారని, తన భర్త మస్తాన్‌వలీ నుంచి ప్రాణహాని ఉందని, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నానా హంగామా చేసింది. తాజాగా  ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్ సంతకం చేసేందుకు వచ్చారు ఈ సందర్భంగా మస్తాన్‌వలీ నుంచి ప్రాణహాని ఉందని, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాను గతంలో అనలేదని ఎర్రచందనం కేసు నిందితురాలు సినీనటి నీతూ అగర్వాల్ అనడంతో అందరూ ఆశ్చర్య పోయారు.


మస్తాన్ వలీతో నీతూ అగర్వాల్


రుద్రవరం పోలీస్‌స్టేషన్ సంతకం చేసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు ఎర్రచందనం కేసుతో తమకు సంబంధం లేదన్నారు,మస్తాన్‌వలీ గురించి మీడియా వద్ద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మస్తాన్‌వలి నుంచి ప్రాణహాని ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాను ఎక్కడా చెప్పలేదన్నారు అంతే కాదు తనకు ప్రస్తుతం తీవ్ర జ్వరంగా ఉందని మనసు అస్సలు బాగాలేదని దయచేసి తన గురించి ఏమీ రాయవద్దని కన్నీరు మున్నీరు అయ్యింది.

మరో పక్క సీఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీనీ నటి నీతూ అగర్వాల్, మస్తాన్ వలి నుంచిగాని, ఆయన కుటుంబ సభ్యుల నుంచి గాని, నాగరాజు అనే వ్యక్తి నుంచి ప్రాణాపాయం ఉందన్న విషయం లికిత పూర్వకంగా తమకు ఇవ్వలేదని ఒకవేల ఇస్తే తప్పకుండా కేసు నమోదు చేస్తామని చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: