విలక్షణ నటుడు ప్రకష్ రాజ్ సహాయంతో త్రిష ఈ మధ్య ఒక రచ్చ నుండి తప్పించుకుంది అని వార్తలు వస్తున్నాయి. చెన్నై బ్యూటీ త్రిష తాను నటించిన సినిమాల ప్రమోషన్ కార్య క్రమాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా మొన్న హైదరాబాద్ లో కమలహాసన్ నిర్మిస్తున్న ‘చీకటి రాజ్యం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ ఫంక్షన్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరచింది.

అయితే అనుకోకుండా కనిపించిన త్రిషను మీడియా ప్రతినిధులు ఏదోవిధంగా కార్నర్ చేసి ఆమె ఎంగేజ్ మెంట్ బ్రేకప్ విషయం పై త్రిష నోటివెంట  ఏమి చెపుతుందో వినాలని మీడియా చాల వ్యూహాత్మకంగా కార్నర్ చేయడానికి ప్రయత్నించింది అని టాక్. అయితే ‘చీకటి రాజ్యం’ సినిమా గురించి మాట్లాడటానికి మైక్ తీసుకుని రెండు నిముషాలు మాట్లాడిందో లేదో ప్రకాష్ రాజ్ ఆమె దగ్గరకు వచ్చి ఎదో చెప్పడంతో హడావిడిగా ఆమె స్పీచ్ ని ముగించి మైక్ ప్రకాష్ రాజ్ కు ఇచ్చి వేగంగా వెళ్ళి పోయింది.

అప్పటికే ఈ విషయాన్ని గ్రహించిన మీడియా ప్రతినిధులు ఆమెను వెంటాడుతూ వరుణ్ మన్యన్ తో ఎంగేజ్ మెంట్ బ్రేకప్ గురించి ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తున్నా పట్టనట్లు వెళ్లిపోయింది త్రిష. త్రిష ఇబ్బంది పడకుండా మీడియా దాడి విషయమై ప్రకాష్ రాజ్ హెచ్చరిక ఇవ్వకపోతే త్రిషకు పెను సమస్యలు వచ్చి ఉండేవని ఆరోజు ఫంక్షన్ కు వచ్చిన వారు గుసగుసలాడుకున్నారు.

అయితే మీడియా ప్రతినిధులు మాత్రం త్రిష గురించి హాట్ న్యూస్ లు అందిద్దాం అని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న తమకు ప్రకాష్ రాజ్ అడ్డుతగిలి మంచి అవకాశాన్ని పోగొట్టాడు అంటూ కొంత మంది మీడియా ప్రతినిధులు ప్రకాష్ రాజ్ పై గుర్రుగా ఉన్నారని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: