తెలుగు సినిమాల్లో బాలీవుడ్ తారలు తలుక్కున్న మెరిసి పోతూ ఉంటారు అలాంటి వారిలో సమీరా రెడ్డి ఒకరు. చిరంజీవి సరసన ‘జై చిరంజీవా’ చిత్రంలో, ఎన్టీఆర్ సరసన ‘అశోక్’, ‘నరసింహ’ చిత్రాల్లో జతకట్టింది. ఈ అమ్మడు తమిళ సినిమాల్లో కూడా నటించింది,గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో నటించింది. షరా మామూలే తర్వాత  బాలీవుడ్ లో అడుగు పెట్టిన  అమ్మడికి మంచి గుర్తింపు ఉంది.


సమీరా ప్రెగ్నెన్సీగా ఉన్నపుడు చిత్రం


సినిమాల్లో మంచి ఫామ్ లో ఉండగానే  వ్యాపారవేత్త అక్షయ్ వార్దేని ప్రేమించి పెళ్లి చేసుకుంది సమీరా.పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.తన వైవాహిక జీవితం చాలా బాగుందని సమీరారెడ్డి ఓ సందర్భంలో చెప్పింది. ఇప్పుడు సమీరా చాలా ఆనందంలో ఉంది దీనికి కారణం నిన్న ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తమ బిడ్డను చూసుకుని సమీరా, ఆమె భర్త తెగ మురిసిపోతున్నారట. ఈ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: