ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌గా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చి ‘గోపాల గోపాల’ సినిమా వెంకటేష్, పవన్ కళ్యాన్ కలయికలో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. తాజాగా నాగార్జున,మహేష్ బాబు మల్టీస్టారర్‌గా మణిరత్నం దర్శకత్వలో రాబోతుందని సమాచారం. ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే  ఐశ్వర్యరాయ్‌ ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తుందని బాలీవుడ్‌ మీడియా గత రెండు రోజులుగా  కోడై కూస్తుంది.


ఓ ఫంక్షన్లో నాగార్జున, నమ్రతా శిరోడ్కర్, మహేష్ బాబు


ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుందని ఐశ్వర్యారాయ్ కన్ఫర్మ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్  మాట్లాడుతూ పోయిన సంవత్సరమే మణిరత్నం సినిమాలో నటించాల్సింది కాని కొన్ని కారణాలు చేయలేక పోయాను అన్నది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతి హాసన్, నాగార్జున సరసన ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వస్తుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి: