ప్రముఖ నిర్మాత దిల్ రాజు తానూ నిర్మిస్తున్న ‘కేరింత’ ఆడియో ఫంక్షన్ లో స్వయంగా బయట పెట్టిన విషయం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. తాను నిర్మించే సినిమాలను చాల ప్లాన్డ్ గా తీసే దిల్ రాజ్ తన లేటెస్ట్ మూవీ ‘కేరింత’ విషయంలో మాత్రం చాల ఆలస్యం చేసాడు. ఈ సినిమాకు సంబంధించి నెల రోజుల షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ రీషూట్లు చేసారు. 

మొన్న జరిగిన ‘కేరింత’ ఆడియో వేడుకలో దిల్ రాజు ఇందుకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చాడు. 30 రోజుల షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ సినిమా కథలో మార్పులు చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తిరిగి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసామని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

అంతేకాదు ఈ సినిమా కథకు ముందుగా సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, అరుణ్ లను హీరోలుగా అనుకుని వారితో ఫోటో షూట్ కూడా చేసి ఆ పాత్రలకు వాళ్ళు సరిపోరు అని తాను భావించి వారిని పిలిచి సారీ చెప్పానన్న సంచలన విషయాన్ని ‘కేరింత’ ఆడియో ఫంక్షన్ లో అందరి ముందు బయట పెట్టాడు దిల్ రాజ్.

ఆ తరువాత ఈసినిమాకు సుమంత్ అశ్విన్, శ్రీదివ్యలు ఈ సినిమాలోని పాత్రలకు సరిపోతారు అన్న భావనతో ఈ సినిమాను అనుకున్న విధంగా 60 రోజుల్లో సినిమాను పూర్తి చేసాను అని అసలు విషయాన్ని బయట పెట్టాడు దిల్ రాజ్. ‘వినాయకుడు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సాయి కిరణ్ అడవి తో కలసి  దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి 



మరింత సమాచారం తెలుసుకోండి: