గత రెండు రోజులుగా టాలీవుడ్ కి చెందిన క్రేజీ హీరోయిన్ అదా శర్మ, బస్ యాక్సిడెంట్ లో తీవ్రగాయాలు పాలయిందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమనుకొని చాలా మంది ఫిల్మ్ సెలబ్రిటీలు అదా శర్మని పరామర్శించటానికి ప్రయత్నించి, అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అదాశర్మ.

తన అందం, నటనతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా సన్నాఫ్ సత్యమూర్తి విజయంతో తెలుగులో బిజీబిజీగా మారిపోయింది. ప్రస్తుతం క్షణం, గరమ్ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్న అదా శర్మ ఓ ప్రమాదానికి గురై గాయాల పాలైందని వార్తలు వచ్చాయి. షూటింగ్ సమయంలో అదా శర్మను ఓ బస్ ఢీకొందని, ఈ ప్రమాదంలో గాయాలపాలైన ఆమె హాస్పిటల్‌లో చేరిందని పుకార్లు పుట్టాయి.

దీంతో కొంత మది ఫిల్మ్ సెలబ్రిటీలు అదాశర్మకి ఫోన్ చేసి వివరాలు కనుక్కోగా, అదంతా పుకార్లు అని తెలిసింది. దీంతో వెంటనే అదాశర్మ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఖండించింది. తనకు ఏ ప్రమాదమూ జరగలేదని, చాలా బాగున్నానని,పుకార్లను నమ్మవద్దని తెలిపింది.

అదా శర్మకు ప్రమాదం జరిగిందనే వార్త పుకారని తేలిపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ న్యూస్ ని ఎవరు క్రియేట్ చేశారో అంటూ అదా శర్మ ఎంక్వైరీ చేసుకుంటుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: