అక్కినేని అఖిల్ మంచి జోష్ పై ఉన్నాడు. తానూ నటిస్తున్న తొలి సినిమా షూటింగ్ నెలరోజులపాటు స్పెయిన్ లో జరగడంతో ఆ షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యాడు అఖిల్. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ స్పెయిన్ షూటింగ్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటుగా పాటలు ఫైట్లు కూడ చిత్రీకరించారని ఆ షూటింగ్ చూడటానికి తన తల్లి తండ్రులు నాగ్ ఆమలలు స్పెయిన్ రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ అఖిల్ తన ట్విటర్ లో తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకుంటున్నాడు. 

 ‘‘మా అమ్మా నాన్న కలసి స్పెయిన్‌లో నా షూటింగ్ సెట్స్‌కు రావడం నాకెంతో గర్వంగా అనిపించింది అంతేకాదు శేఖర్ మాస్టర్‌తో డ్యాన్సులు, స్పెయిన్‌లోని అద్భుతమైన మష్‌రూమ్ బిల్డింగ్ దగ్గర స్టంట్ మాస్టర్ రవివర్మతో యాక్షన్ సీన్లు, హీరోయిన్ సాయేషా సైగల్‌తో పాటలు ఇవన్నీ నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి” అంటూ పొంగిపోతూ ట్విట్ చేసాడు అఖిల్. 

అంతేకాదు అమితాబ్, దీపికా పదుకొనేల ‘పికూ’ సినిమా బాగుందని తెలిసి ఆసినిమా ఆడుతున్న హాలును వెత్తుకుంటూ స్పెయిన్ లో ఆ సినిమా చూడటం తనకు ఒక అనుభూతి అని అంటూ తన సినిమా పై మీడియాలో ప్రచారం అవుతున్న ‘మిస్సైల్’ టైటిల్ పేరు నిజంకాదు కాదు  అంటూ వివరణ ఇచ్చాడు. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమా దసరాకు విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈసినిమాకు దసరా పండుగ నేపధ్యాన్ని కలుపుకుని ‘దసరాబుల్లోడు’ అని టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని నాగార్జున సన్నిహితులు నాగ్ కు సలహా ఇచిన్నట్లు వార్తలు విన్న అఖిల్ షాక్ అయ్యాడని  టాక్. కానీ ఇవేమీ కాకుండా ఒక పవర్ ఫుల్ టైటిల్ కోసం నాగ్ వినాయక్ లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: