ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న శ్రీమంతుడు షూటింగ్ పూర్తికావొచ్చింది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను జూలై 17న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత మహేష్‌బాబు నటించే మరో సినిమాకు జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. బ్రహ్మోత్సవం పేరుతో రూపొందే ఈ సినిమా విజయవాడ నేపథ్యంలో వుంటుందని, అక్కడి రౌడీయిజం అంశాన్ని కొంచెం టచ్ చేసేలా ఈ సినిమాను రూపొందించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ సినిమాను విజయవాడ దుర్గ గుడిలో కూడా షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

దానికోసం ఈ చిత్ర దర్శకుడితో పాటు కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి విజయవాడ వెళ్లి లోకేషన్లను పరిశీలించారట. వాటిలో ప్రకాశంబ్యారేజ్, కనకదుర్గమ్మ గుడి, బెంజ్ సర్కిల్ వంటి ప్రదేశాలను ఎంచుకున్నారని తెలుస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కోసం భద్రాచలం రామాలయంలో, ‘ముకుంద’ సినిమా కోసం ద్రాక్షారామం గుడిలో కొన్ని ముఖ్యసన్నివేశాలు షూట్ చేసిన శ్రీకాంత్ ఈసారి ‘బ్రహ్మోత్సవం’ కోసం విజయవాడ ‘దుర్గగుడి’లో షూట్ చేయస్తాడనమాట.

ఈనెల 31న ఈ సినిమా ప్రారంభం కానుంది. షూటింగ్ మాత్రం ఎక్కువ భాగం విజయవాడలో జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: