సినిమాలలో ద్విపాత్రాభినయం చేసే నందమూరి సింహం బాలకృష్ణ నిన్న తన నిజజీవితంలో కూడా ద్విపాత్రాభినయం చేసాడు. నిన్న ఉదయం తన 99వ సినిమా ‘డిక్టేటర్’ ప్రారంభోత్సవంలో యంగ్ లుక్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన బాలయ్య నిన్న మధ్యహ్నం తన లుక్ ను మార్చి తిరిగి రాజకీయ అవతారం ఎత్తి తెలుగుదేశం మహానాడు ముగింపు సమావేశంలో బాలయ్య మాట్లాడిన ఆవేశ పూరితమైన ఉపన్యాసం తెలుగుదేశం కార్యకర్తలను విపరీతంగా ఆకర్షించింది.

‘ఎన్టీఆర్, తెలుగు అన్న పదాలు వింటే తన రక్తం ఉడికి పోతుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా ఆ రెండు పదాల కోసం తాను ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అంటూ బాలయ్య ఆవేశపూరితంగా మాట్లాడి మరోసారి తనలోని లయన్ ను తట్టి లేపాడు. నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీని  జాతీయ పార్టీగా అధికారికంగా మహానాడు పండుగలో ప్రకటించిన నేపధ్యంలో బాలకృష్ణ ఈ కామెంట్స్ చేసాడు. 

గతంలో కాంగ్రెస్ వేవ్ దేశాన్ని అంతా కుదిపెసినా దానిని ఎదిరించిన ఏకైక శక్తి నందమూరి తారకరామారావు అని అంటూ తన బావ చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఎదిగి సంచలనాలు చేయడం ఖాయం అంటూ బాలయ్య మహానాడు సాక్షిగా సవాల్ విసిరాడు. 

నిన్నటిరోజు ఉదయం యంగ్ హీరోయిన్ అంజలితో కలిసి ‘డిక్టేటర్’ గా ఫోటోలకు  పోజులు ఇచ్చిన బాలయ్య కేవలం కొన్ని గంటల వ్యవధిలో తన లుక్ నే కాకుండా తన బాడీ లాంగ్వేజ్ ను కూడ మార్చి తనలోని రెండు రూపాలను ఒకేరోజు బయటకు తీసిన బాలకృష్ణ స్పీచ్ నిన్నటి మహానాడుకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా బాలయ్యలోని లయన్ రూపo మరోసారి బయటపడింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: