తాజాగా రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీ ఫస్ట్ లుక్ మహేష్ అభిమానులని ఫుల్ జోష్ లోకి తీసుకువెళ్ళింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ’శ్రీమంతుడు’ టీజర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే శ్రీమంతుడు ఆడియో వేడుకకు కూడా ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. జూన్ రెండో వారంలో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను జరపనున్నట్లు సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ మహేష్ కలయికలో రూపొందిన ఆడియో సూపర్ కిక్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం.

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు ఈ ఆడియో ఫంక్షన్ కి హాజరు కావడమే కాకుండా, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కొందరు స్టార్ హీరోలు శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చిత్ర యూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

శృతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. మహేష్ బాబు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: