టాలీవుడ్ దర్శకుడు నిర్మాత నటుడు అయిన రాజ్ కందుకూరికి నిన్న శుక్రువారం ప్రధానమంత్రి మోడీ దగ్గర నుండి స్వయంగా ఫోన్ రావడం అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తి వేసింది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి ఒక టాలీవుడ్ డైరెక్టర్ కు ఫోన్ చేయడమే కాకుండా అతడి తండ్రి యోగ క్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకోవడం రాజ్ కందుకూరికి నమ్మలేని నిజంగా మారింది.

ఇక వివరాలలోకి వెళితే రాజ్ కందుకూరి తండ్రి శ్రీ శివానంద మూర్తి ఒక ప్రముఖ సద్గురు. మాజీ ప్రధాన మంత్రి వాజ్ పాయ్ దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు చాలామంది శివానంద మూర్తికి శిష్యులు. ప్రధానమంత్రి మోడీకి కూడా శివానంద మూర్తి అంటే చాల గౌరవం. 

అటువంటి శివానంద మూర్తికి గత కొద్ది కాలంగా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు అని తెలుసుకున్న ప్రధానమంత్రి మోడీ దర్శకుడు రాజ్ కందుకూరికి స్వయంగా ఫోన్ చేసి శివానంద మూర్తి ఆరోగ్యానికి సంబంధించి సమాచారాన్ని రాజ్ కందుకూరి వద్ద నుండి తెలుసు కోవడమే కాకుండా తన తండ్రికి కావలసిన వైద్య సహాయాన్ని అంతా అందిస్తామని  తెలియచేయడం  మోడీ సంస్కారానికి నిదర్శనo  అంటూ పొంగిపోతున్నాడు.

రాజ్ కందుకూరి అనేక అవార్డు సినిమాలను నిర్మించిన దర్శకుడు మరియు నిర్మాత. బుద్ధుడి జీవితం పై ‘గౌతమ్ బుద్ధ’ లాంటి అవార్డు సినిమాను నిర్మించడమే కాకుండా గతంలో పవన్ కళ్యాణ్ తో ‘తమ్ముడు’ సినిమాలో రాజ్ కందుకూరి ఒక పాత్రను కూడ పోషిoచాడు. ఒక టాలీవుడ్ దర్శకుడికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ రావడం టాలీవుడ్ కు సంచలన వార్తగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: