ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, బాక్సాపీస్ ని షేక్ చేయగల చిత్రాలను తెరకెక్కించే దర్శకులు ఉన్నారు కాని, ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని, చూడదగ్గ సినిమాని తీయగల దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. శేఖర్ కమ్ముల అనామిక మూవీ తరువాత తనకి పెద్దగా ఆఫర్స్ రావడంలేదు.

ఒకవేళ శేఖర్ వద్దకు వచ్చిన నిర్మాతలు, శేఖర్ కథలో మార్పులు చేర్పులు అంటూ డిమాండ్ చేయటంతో, అటువంటి నిర్మాతలను శేఖర్ కమ్ముల పూర్తిగా దూరం పెట్టేశాడు. దీంతో శేఖర్ కమ్ముల వద్ద ప్రేక్షకులు సినిమాలు ఆశిస్తున్నప్పటికీ, సరైన చిత్రాలు రావడం లేదు. ఇదిలా ఉంటే తాజగా టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గుబాటి రానా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించటానికి మరోసారి సిద్ధపడ్డాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, దగ్గుబాటి రామానాయుడు అలియాస్ రాణా దగ్గుబాటి ఇ౦డస్ట్రీకి ఎ౦టర్ అయిన తొలి సినిమా లీడర్. ఆన౦ద్, గోదావరి మరియు హ్యాపిడేస్ తో అద్బుత ఫా౦లో ఉన్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరీ బాగానే నడిచి౦ది,అలాగే రాణాకు ఇ౦డస్ట్రీలో తొలి సినిమాతోనే తేవాల్సిన౦త పేరును తెచ్చిపెట్టి౦ది ఈ సినిమా.

ఇలా౦టి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాని౦గ్స్ జరుగుతున్నాయని తెలిసి౦ది. లీడర్ తరువాత శేఖర్ కమ్ముల చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, కహానీ రీమేక్ అనామిక రె౦డు ఫ్లాఫ్ సినిమాలుగా మిగలడ౦తో ఖాలీ అయిపోయిన శేఖర్ కమ్ముల ప్రస్తుత౦ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రిపేర్ చేయడ౦లో ఫుల్ బిజీగా ఉన్నాడని టాక్. దీంతో రాణా డేట్స్ ఇచ్చినందుకు శేఖర్ కమ్ముల ఫుల్ జోష్ లో ఉన్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: