టాలీవుడ్ పిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు? ఎవరి మ‌ధ్య ఏ విధంగా గొడ‌వ‌లు వ‌స్తాయి? ఏ విధమైన కాంబినేష‌న్స్ క‌లుస్తాయి? అనేది ఎవ్వ‌రూ చెప్ప‌లేదు. తాజాగా పూరీతో క్యాన్సిల్ అయిన నితిన్ సినిమా, త్వ‌ర‌లోనే ఓ క్రేజీ డైరెక్ట‌ర్ లో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, చిన్నదాన నీకోసం సినిమా తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వని నితిన్.. ప్రస్తుతం అక్కినేని అఖిల్ మొదటి చిత్రానికి నిర్మాతగా బిజీ అయ్యాడు.

అయితే చిన్నదాన నీకోసం ఫలితంతో కాస్త నిరుత్సాహ పడిన నితిన్.. ఈసారి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ మధ్య కొత్త దర్శకుడు శ్రీనివాసరెడ్డితో సినిమా ఓకే చేసి.. చివరికి కథ విషయంలో తేడాలొచ్చి ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగాడు. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. అది కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

ఆ రెండు సినిమాలు మిస్ కావడంతో.. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట నితిన్. ఇందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని సైతం నితిన్ అప్రోచ్ అయిన‌ట్టు తెలుస్తుంది. అయితే పూరీ-నితిన్ కాంబినేష‌న్ ఫైనాన్షియ‌ల్ కార‌ణాల‌తో క్యాన్సిల్ అయింద‌నే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బాహాటంగా వినిపిస్తున్న న్యూస్‌.

పూరీ ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న చిత్రాలు అన్నీ క‌మ‌ర్షియ‌ల్ కాన్సెప్ట్ లే. హీరో పెట్టుబ‌డి ఎంత‌? వ‌చ్చిన లాభాల్లో షేర్ ఎంత‌? అన్న‌ట్టుగా పూరీ సినిమాలు తెర‌కెక్కిస్తున్నాయి. అయితే నితిన్ తో వ‌చ్చిన ఫైనాన్షియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ కి ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళ‌లేక‌పోయాడు పూరీ. దీంతో పూరీ కంటే గొప్ప డెరెక్ట‌ర్ తో మూవీని తీయాల‌ని నితిన్, ఇప్పుడు త్రివిక్ర‌మ్ ని ఒప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడంట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: