ఈ మధ్య కాలంలో గాసిప్పులకు దూరంగా ఉంటున్న రానా తిరిగి యూటర్న్ తీసుకుని హీరోయిన్స్ మధ్య సందడి చేయడం ప్రారంభించాడు అన్న విషయానికి హైదరాబాద్ లో జరిగిన ‘సైమా’ అవార్డ్స్ ప్రెస్ మీట్ లో గోపికలతో కూడిన కృష్ణుడులా రానా చేసిన హడావిడి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఇచ్చే ‘సైమా’ ఆవార్డ్స్ ను ఫిలింఫేర్ అవార్డులు తరువాత అంత విలువైనవిగా మన సెలెబ్రెటీలు భావిస్తారు. ఇప్పుడు ఈ వేడకకు దుబాయ్ అతిధ్యం ఇవ్వడంలో అంతర్జాతీయంగా ఈ అవార్డు ఫంక్షన్ కు మరింత గుర్తింపు వచ్చింది. 'సైమా' (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) నాలుగో పురస్కారాల వేడుక వచ్చే నెల 6, 7 తేదీల్లో దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జరగబోతోంది. 

ఈ ఈవెంట్ విశేషాలను రానా అనేకమంది హీరోయిన్స్ తో కలిసి నిన్న మీడియాతో షేర్ చేసుకున్నాడు. అయితే ఈసారి జరగబోతున్న అవార్డ్స్ ఫంక్షన్ లో టాలీవుడ్ కు సంబంధించి ఏ హీరోకి ఉత్తమ నటుడి అవార్డు వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ రానా విచిత్రమైన కామెంట్ చేసాడు. పోటీలో లేకపోయినా ‘మనం’ సినిమాకు సంబంధించి అక్కినేని నాగేశ్వరరావుగారికి ఈ పురస్కారం ఇవ్వడo సముచితమని భావిస్తున్నాను అని చెప్పడంతో అక్కినేనికి రానా అవార్డు రికమెండ్ చేస్తున్నాడా అంటూ కొంతమంది మీడియా ప్రతినిధులు సెటైర్లు వేసినట్లు టాక్. 

నిన్న జరిగిన మీడియా సమావేశానికి  కృతి కర్బంగా, పూజా హెడ్గే, శ్రియ లాంటి ఎందరో హీరోయిన్స్ హాట్ హాట్ గా వస్తే వారిమధ్య పోజులు ఇస్తూ రానా చేసిన హడావిడితో మీడియా సమావేశం వేడెక్కి పోయింది అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: