బాహుబలి’ సినిమాలో అవంతిక పాత్రకు తనను ఎంపిక చేయడం తన అదృష్టం అంటూ రాజమౌళిని తెగ పొగిడిన తమన్నా జక్కన్నకు ఊహించని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమన్నాకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ రీత్యా బాలీవుడ్ కు సంబంధించి ‘బాహుబలి’ ప్రచారానికి సంబంధించిన మీడియా సమావేశాలలో అలాగే హిందీ ఛానల్స్ ‘బాహుబలి’ ప్రమోషన్ కార్యక్రమాలలో తమన్నాను బాగా ఎక్స్ పోజ్ చేస్తూ వచ్చాడు. తమన్నా కూడ తన శక్తిమేరకు బాలీవుడ్ లో తన వంతు ప్రచారాన్ని ‘బాహుబలి’ కి చేసింది. 

అయితే తమన్నా టాలీవుడ్ లో ‘బాహుబలి’ ప్రచారానికి రాజమౌళి ఎంత అడిగినా తప్పనిసరి పరిస్థుతులలో డుమ్మా కొడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగార్జున కార్తి హీరోలుగా వంశీ పైడి పల్లి దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ సినిమా యూరప్ అవుట్ డోర్ షూటింగ్ కోసం తమన్నా వచ్చే వారం  నుండి యూరప్ వెళ్ళబోతోంది అని టాక్.

ప్యారిస్, సెర్బియా లాంటి అందమైన యూరప్ లోకేషన్స్ లో నాగ్ కార్తి తమన్నాల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను సుమారు 30 రోజులపాటు జరిగే షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. దీనివల్ల టాలీవుడ్ లో ‘బాహుబలి’ కీలక ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యే సమయానికి తమన్నా రాజమౌళికి అందుబాటులో ఉండదు. అంతేకాదు ‘బాహుబలి’ విడుదల తరువాత ఆ సినిమా క్రేజ్ ను మరింత పెంచడానికి రాజమౌళి ప్లాన్ చేసిన ఏ ప్రచార కార్యక్రమాలలోనూ తమన్నా కనిపించే అవకాశం లేదు.

ముందుగానే నిర్ణయించుకున్న కీలక షెడ్యూల్ కావడంతో ‘బాహుబలి’ ప్రచారానికి  తమన్నా ఇక అధికారికంగా బైబై చెప్పినట్లే అని సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికే సెన్సార్ టాక్ అంటూ ‘బాహుబలి’ సినిమా పై నెగిటివ్ టాక్ ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియాక తల పట్టుకుంటున్న రాజమౌళికి తమన్నా మరొక తల నొప్పిగా మారింది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: