తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంగా వెండి  తెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు బీజీ బీజీగా ఉన్నాడు. ఆగస్టులో 7న  ‘శ్రీమంతుడు’ రిలీజ్ కాబోతుంది. వెంటనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ఇక ‘హ్యాపీడేస్’యూత్ ఫుల్  సినిమాతో అందరి మనసు దోచేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఈయన చాలా సున్నితమైన కథాంశాలతో మనసుకు హత్తుకునే సినిమాలు తీస్తారు. ఆనంద్,గోదావరి లాంటి సినిమాలు మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు.

ప్రిన్స్ మహేష్ బాబు


తాజాగా శేఖర్ కమ్ములకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో మంచి ఫ్యామిలీ కథతో సినిమా రాబోతుందట. వాస్తవానికి వీరిద్దిరి కాంబినేషన్ లో సినిమా రావాల్సిందే కానీ అప్పట్లో మహేష్ బిజీ కావడం వల్ల మంచి కథ లభించక పోవడం వల్ల లేట్ అయ్యింది. అందే కాదు ‘గోదావరి’ సినిమాలో మహేష్ బాబుతో తీయాల్సింది కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు.   ప్రస్తుతం ఈ స్క్రిప్టు పనిలోనే శేఖర్ బిజీగా ఉన్నారట మరి వీరిద్దరి కాంబినేషన్ అంటే మంచి అహ్లాదంగా ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ మూవీ అయివుంటుందని భావిస్తున్నారు  ఫిల్మ్‌నగర్ వర్గాలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: