గత కొంత కాలంగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వహిస్తున్న మూవీలకి క్రేజ్ తగ్గిందా?అంటే దాదాపు అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే దీనీకో లెక్క వుందంటున్నారు స్వయంగా కోలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులే. అంతే కాకుండా తాజాగా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మరోసారి శంకర్ కి చుక్కలు చూపించిందంటూ వస్తున్న వార్తలు కోలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, శంకర్ కి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి పేరుంది.

తన మూవీలో సోషియల్ సర్వీస్ కి సంబంధించిన మెసేజ్ ఉంటూ, కథని అద్భుతంగా చూపించగల దర్శకుడు కూడ ఉండటం అందరికి నచ్చే విషయం. అయితే శంకర్ తో పనిచేయాలని బిటౌన్ కి చెందిన బడా స్టార్స్ ని పిలుపు వస్తున్నా, శంకర్ మాత్రం బిటౌన్ కి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే శంకర్ స్క్రీప్ట్ లో వారు చెప్పే కొద్దిపాటి మార్పులకు శంకర్ ఏమాత్రం ఒప్పుకోకపోవడమే. అందులో గతంలో షారుక్, శంకర్ కాంబినేషన్ కథా చర్ఛల వద్దనే ఆగిపోయింది.

అయితే ఇప్పుడు రోబో2 విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. రోబో2లో విలన్ గా షారుఖ్ నటిస్తాడంటూ వినిపిస్తున్న వార్తల్లో భారీ మార్పులు జరబోతున్నాయని కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రోబో సీక్వెల్‌లో విక్రమ్ విలన్‌గా నటించనున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. ఈ రోబో-2లో రజనీ కాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ మేరకు దర్శకుడు శంకర్‌కు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్ర ప్రారంభానికి సన్నాహాలు అపుడే మొదలయ్యాయి.అయితే దీని మీద నటుడు విక్రమ్ ఎటువంటి ప్రకటన చేయలేదు.

రోబో సీక్వెల్‌లో విక్రమ్ నటించడానికి ఉత్సుకత చూపుతున్నప్పటికీ, చేతిలో రెండు సినిమాలు ఉండటంతో డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రోబో2క సంబంధించిన విలన్ పాత్రలో షారుఖ్ మార్పులు అడగగా, శంకర్ అందుకు ఒప్పుకోకపోవడంతో తిరిగి వ్యవహారం మాములు పరిస్థితికి వచ్చింది. షారుఖ్ ఇక రోబో2లో నటించడం లేదంటూ ప్రస్తుతం టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా బిటౌన్ హీరోలు శంకర్ కి చుక్కలు చూపిస్తున్నారంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: