ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఫిల్మ్ కెరీర్ నికొనసాగిస్తున్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు, ఒక మూవీ చేస్తుండగానే మరోమూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే మరో మూవీకి సంబంధించిన కథా చర్ఛల్లో పాల్గొంటాడు.

ఇలా తను ఎప్పుడూ రెండు మూవీలను లూప్ లో పెట్టుకుంటూ వస్తుంటాడు. తాజాగా శ్రీమంతుడు మూవీకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసి, బ్రహ్మోత్సం మూవీకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక బ్రహ్మోత్సవం మూవీ అనంతరం, మహేష్ త్రివిక్రమ్ తో చేసే ఛాన్స్ ఉంది. ఆ మూవీ అనంతరం స్టార్ డైరెక్టర్ రాజమౌళితో తన కాంబినేషన్ ని ఫిక్స్ చేసుకున్నాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ కాంబినేషన్‌లో త్వరలో ఓ చిత్రం రూపొందనుంది. జక్కన్న రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి రెండు భాగాలు విడుదలైన తర్వాత టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌ను డైరెక్ట్ చేస్తానని తనే స్వయంగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించి రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కోసం తామిద్దరం ఎప్పుడో సంతకాలు చేశామని రాజమౌళి తెలిపారు.

కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం రూపుదిద్దుకోలేదని, ‘బాహుబలి-2’ పూర్తవ్వగానే, మహేష్ చిత్రంపై దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. అయితే ఈ చిత్రం ప్రారంభం కావడానికి మరో సంవత్సరం పట్టవచ్చని చెప్పారు. ఈలోపు మహేశ్ ప్రస్తుత ప్రాజెక్టులు ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం’తో పాటు పూరితో కూడా మరో సినిమా పూర్తవుతుంది. ఆ తర్వాత మహేష్ కి ఫ్రీ టైం ఉంటే త్రివిక్రమ్ తో లేదంటే రాజమౌళితో మూవీని ఫిక్స్ చేయబోతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: