తెలుగు ఇండస్ట్రీలో తన బుల్లి బుల్లి అడుగులతో ‘సిసింద్రి’గా వచ్చి ‘మనం’ సినిమాలో మెరుపులా మెరిసిన యువ హీరో అఖిల్. వివివినాయక్ దర్శకత్వంలో మాస్,యాక్షన్, ఎంట్రటైన్ మెంట్ సినిమా  తెరకెక్కబోతుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  ఆ మధ్య స్పెయిన్ లో కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని పాటలను చిత్రీకరించగా.. ఇప్పుడు థాయ్ లాండ్ షెడ్యూల్ లో కామెడీ సీన్స్ ను చిత్రీకరించారట.

అఖిల్ అక్కినేని కొత్త చిత్రం పోస్టర్


అఖిల్‌, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ తో పాటు ఇతర నటీనటులపై ఈ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని మిగతా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు.బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని వంశంలో మరో హీరో రాబోతున్నాడు అంతే కాదు అఖిల్ పై అంచనాలు బాగానే ఉన్నాయి.  ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూపొందుతోందంటున్నారు.

నితిన్, అఖిల్ లతో దర్శకుడు వివివినాయక్


ఈ సినిమాకు ఏ టైటిల్ ఎంపిక చేస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు. ఈ నెలాఖరు వరకూ చిత్రీకరణ పూర్తి చేయడంతో పాటు.. టైటిల్ ను కూడా రివీల్ చేసే యోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు. మొత్తానికి అఖిల్ విజయదశమిన పండుగ చేసుకోబోతున్నాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: