‘బాహుబలి’ సక్సస్ తో సూపర్ జోష్ మీద ఉన్న ప్రభాస్ ఉత్సాహం పై అతడి పెదనాన్న కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో కలిసి కృష్ణంరాజు ప్రధానమంత్రి మోడీని కలిసినప్పుడు కృష్ణంరాజు ప్రభాస్ పై ఈ సెటైర్లు వేసినట్లు టాక్. ‘ప్రభాస్ ‘బాహుబలి’ కాదు కేవలం రీల్ బాహుబలి మాత్రమే రియల్ బాహుబలి మీరు’ అంటూ కృష్ణంరాజు ప్రధానమంత్రి మోడీ దగ్గర కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కామెంట్స్ కు మోడీ చాల ఆనంద పడినట్లు తెలుస్తోంది. కృష్ణoరాజు గతంలో వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా పనిచేసిన ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా విధులు నిర్వర్తించిన నేపధ్యంలో అప్పటి నుండి కృష్ణంరాజుకు మోడీతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే తన వారసుడు ప్రభాస్ ను తీసుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడి పెద్దలందరికీ ప్రభాస్ ను పరిచయం చేస్తున్నాడు.

ఇదే సందర్భంలో మోడీతో ప్రభాస్ మాట్లాడుతూ ‘బాహుబలి’ సినిమాను మోడీ ఆశయాలకు అనుగుణంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్ తో విదేశీ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకున్నా అంతా ఇండియాలోనే ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ జరిగాయి అన్న విషయాన్ని ప్రభాస్ మోడీ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు మోడీ ఆనంద పడినట్లు టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా కృష్ణంరాజు ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి ఢిల్లీ మంత్రుల వద్ద చేస్తున్న ప్రచారంలో కేవలం ప్రభాస్ ను మాత్రమే ఎక్స్ పోజ్ చేస్తూ ఎక్కడ రాజమౌళి ప్రస్తవన లేకుండా వ్యవహారం నడిపించడంతో  బయటకు చెప్పకపోయినా రాజమౌళి షాక్ అయ్యాడు అని టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: