శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మిల్క్ బ్యూటీ తమన్న తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ అమ్మడు  టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. తాజాగా రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దిన ‘బాహుబలి’ లో అవంతిక గా మంచి పేరే సంపాదించింది. అంతే కాదు ఈ సినిమా కోసం ప్రమోషన్ వర్క్ లో ఈ అమ్మడే ఎక్కువ పాల్గొంది.

తాజాగా ఈ అమ్మడు ఓ ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వివివినాయక్ దర్శకత్వంలో వచ్చి అల్లుడు శీను సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో తమన్నా వేసిన స్టెప్పులకు థియేటర్లో ప్రేక్షకులు వీర లెవెల్లో సందడి చేశారు. తాజాగా ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా బి.వి.ఎస్‌.ఎస్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం లండన్‌లో జరుగుతోంది. ఇక సుకుమార్ దర్శకత్వం అంటే ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే.. మరి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు తమన్నాను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.  

అల్లుడు శీను ఐటమ్ సాంగ్ లో తమన్నా


ఈ సినిమాకు సంగీతం  దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు అంటే సాంగ్ కూడా పక్కా మాస్ గా ఉండబోతుందన్నమాట. ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అని టైటిల్ అనుకుంటున్నారట కానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఇప్పటికే ఈమె 'అల్లుడు శీను' సినిమాలో ఐటంసాంగ్‌లో ప్రేక్షకులను ఊరుతలూగించి తమన్నా ఈ సినిమాలో ఎన్టీఆర్ తో స్టెప్పులు ఏ రేంజ్ లో వేయనుందో.. అంతే కాదు ఈ పాట సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిటి భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: