ప్రేమ వ్యవహారాల్లో యాసిడ్ దాడులు జరుగుతుండటం ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కువయ్యాయి. అయితే ఓ సినీ దర్శకుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా మరో హీరోతో కలిసి నటిస్తుండటాన్ని సహించక నటీనటులపై యాసిడ్ దాడి చేసిన ఘటన భోజ్ పురిలో చోటుచేసుకుంది. దాడికి మూల కారణం ప్రేమ వ్యవహారమే అని తెలుస్తోంది. భోజ్ పురి సినిమా పరిశ్రమలో రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. షూటింగ్ విశ్రాంతి సమయంలో వారు ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయాడు. సడెన్ గా జరిగిన ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యపోయారు. 


వివరాల్లో కి వెళితే ...  ఓ సినీ దర్శకుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా మరో హీరోతో కలిసి నటిస్తుండటాన్ని సహించక నటీనటులపై యాసిడ్ దాడి చేసిన తెలుస్తుంది. తాను వద్దన్నా వినకుండా వికాస్ తో కలిసి నటిస్తున్నందునే అజయ్ ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ లోని బలియా పట్టణం సమీపంలోని నారాయణ్ పూర్ విలేజ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏఎస్పీ కేసీ గోస్వామి మాట్లాడుతూ నిందితుడు అజయ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.అక్కడి నుంచి వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపారు. ఇద్దరిలో రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: