టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ‘మీడియా షై’ అనే పేరు ఉంది. సినిమా రంగంలోకి అడుగు పెట్టి 16 సంవత్సరాలు దాటిపోయినా మహేష్‌ ఇంకా మీడియా ఇంటర్వ్యూలు అంటే సిగ్గు పడుతూనే ఉంటాడు. అటువంటి మహేష్ ప్రవర్తనను మార్చడానికి నమ్రత గట్టి నిర్ణయం తీసుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ ఈసారి తన ‘శ్రీమంతుడు’ సినిమా ప్రచారం విషయంలో మహేష్ ‘దూకుడు’ ప్రదర్శించనున్నాడని టాక్.  ప్రచారపరంగా ‘బాహుబలి’ విజయం నేర్పిన కొత్త పాఠాలు మహేష్ కు కనువిప్పు కలిగించాయి అని అంటున్నారు. దీనితో ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ బాధ్యత అంతా పర్యవేక్షించడానికి స్వయంగా నమ్రత రంగంలోకి దిగింది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈసినిమా మార్కెటింగ్ ప్రమోషన్ బాధ్యతలు చూస్తున్న నమ్రత మహేష్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న బ్రాండ్స్ ప్రమోషన్ యాడ్స్ లో కూడ ‘శ్రీమంతుడు’ ప్రచారం జరిగే విధంగా ఆ యాడ్స్ కు కొత్తలుక్ ను తేవడానికి నమ్రత సరికొత్త ఆలోచనలు చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి ఉదాహరణగా మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టాటా స్కై ఈవెంట్ లో మహేష్ ‘శ్రీమంతుడు’ లోని సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది నమ్రత.

ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ లోని ‘చారు శీల’ పాట మేకింగ్ వీడియో తెలుగు టివి చానెళ్లలో తెగ హడావిడి చేస్తోంది. తమిళంలో  ‘సెల్వదన్‌’ గా వస్తున్న ఈ సినిమా  ‘బాహుబలి’ తర్వాత కోలీవుడ్ లో విడుదల అవుతున్న భారీ చిత్రంగా ఇప్పటికే కోలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ తమిళ వర్షన్ ఆడియో లాంచ్ ను ఈవారంలో చెన్నైలో చాల ఘనంగా నిర్వహించి మహేష్ క్రేజ్ ను తమిళనాడులో కూడ పెంచాలని వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది నమ్రత. ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను 70 కోట్ల కలెక్షన్స్ సినిమాగా మార్చాలని నమ్రత చేస్తున్న ప్రయత్నాలను చూస్తున్నవారు మహేష్ ను నమ్రత బాగా మార్కెట్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: