మొన్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి చెందిన విషయం తెలిసిందే..ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఈయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఇక యావత్ భారత దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. అబ్దుల్ కలాం భారత దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ ఎంతో మంది సెలబ్రెటీలు, రాజకీయ వేత్తలు, వ్యాపార వేత్తలు, విద్యా సంస్థలు ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. కానీ బాలీవుడ్ నటీమని అనుష్క మాత్రం పెద్ద పొరపాటు చేసింది.అదీ ఒక్క సారి కూడా కాదు రెండు సార్లు చేసిన తప్పే మరోసారి..

విషయానికి వస్తే.. అబ్దుల్ కలాం మృతి చెందిన విషయం తెలుసుకొని బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తూ.. ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ ట్విట్ చేశారు. ఇక పనిలో పనిగా ఈ ముద్దుగుమ్మ కూడా ట్విట్ చేయాలనుకుంది..మరి ఆ ట్విట్ లో తప్పులు చేసి  నెటిజన్లతో తిట్లు తిట్టించుకుంది. ఏపీజే అబ్దుల్ కలాం అనే పేరు బదులుగా ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు తప్పుగా రాసి ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని వాటిని తొలగించి అభాసుపాలు అయ్యింది.


అనుష్క శర్మ ట్విట్స్


ఈ అమ్మడు ఏపిజే అబ్దుల్ కలాం కు బదులుగా ‘‘''ఏబీజే కలాం ఆజాద్ '’ అని ఒకసారి ''ఏపీజే కలాం ఆజాద్ ''  మరోసారి ట్విట్ చేసీంది ఇక నెటిజన్లు ఊరుకుంటారా నీకు ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేదా అంటూ తిట్ల పురాణం మొదలు పెట్టారు. దీంతో తప్పు తెలుసుకొని కరెక్టు చేసింది. అప్పటికే ఎంత డ్యామేజ్ కావాలో అంతా అయ్యింది. దేశం గర్వించతగ్గ మహా నాయకుడు అయిన ఏపీజే అబ్దుల్ కలాం పేరు అనుష్క కు తెలియకపోవడం మరీ విచిత్రం పోనీ తెలియకపోయినప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే అనుష్క ఆ పని చేయకుండా తొందరపడి ట్వీట్ చేసి అభాసుపాలయ్యింది .


మరింత సమాచారం తెలుసుకోండి: