ఇండియన్ సెన్సేషనల్ సినిమాగా ‘బాహుబలి’ ని మార్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న రాజమౌళికి బ్లాక్ బస్టర్ గణేష్ గా అందరిచేత పిలిపించుకునే బండ్ల గణేష్ చేసిన లేటెస్ట్ ట్విట్ చూసి రాజమౌళి షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగా కుటుంబ వీరాభిమానిగా పేరు గాంచిన బండ్ల గణేష్ దృష్టి ‘బాహుబలి’ పై పడటమే కాకుండా ఆ సినిమా ఘన విజయం పై విచిత్రంగా స్పందించాడు.

‘బాహుబలి కన్నా అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం నాజీవిత ధ్యేయం. ఆ సినిమా ఘనవిజయాన్ని చూసేవరకు నా శత్రువులు నా శత్రువులు కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను’ అంటూ తన ట్విట్ ముగించాడు. దీనితో బండ్ల గణేష్ త్వరలో ‘బాహుబలి’ కన్నా పెద్ద స్థాయిలో నిర్మించబోయే సినిమాలో హీరో ఎవరూ అలాగే ఆ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారు అంటూ అప్పుడే మాటలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు బండ్ల గణేష్ పేర్కొన్న శత్రువులు ఎవ్వరు? అన్న విషయం పై అప్పుడే ఫిలింనగర్ లో చర్చలు కూడ మొదలు అయ్యాయి. ఈ వార్తలు ఇలా ఉండగానే బండ్ల గణేష్ ‘రాముడు లేని రామాయణాన్ని చదవడం కష్టమో, చిరంజీవి ప్రస్తావన లేని తెలుగు సినిమా రంగ చరిత్ర గురించి మాట్లాడటం కూడా అంతేకష్టం’ అంటూ బండ్ల గణేష్ మరో అడుగు ముందుకు వేసి చేసిన ట్విట్ మరింత సంచలనంగా మారింది.

భారీ సినిమాలు తీయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ‘గబ్బర్ సింగ్’, ‘బాద్ షా’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘టెంపర్’ లాంటి భారీ సినిమాలను చాలా తీసినా ఒక్క ‘గబ్బర్ సింగ్’ మినహా మరే సినిమా భారీగా హిట్ కాకపోవడంతో నిరాశతో ఇటువంటి ట్విట్స్ చేస్తూ తన మెగా కుటుంబ భక్తిని మరోసారి బయటపెట్టాడ అని అనిపించడం సహజం. ఏమైనా బండ్ల గణేష్ ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ చేసిన  ట్విట్  తో రాజమౌళి షాక్ అవుతాడు అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: